Interview with smt.Padmavathi Athreya about controversial letter
ఆత్రేయ గారి రచనల్లోకెల్లా విశిష్టమైన రచన పద్యాలతో కూడిన వారి "ఆత్మ కథ". ఈ ఆత్మకథ రచనా ప్రయత్నం ఆత్రేయ వ్యక్తిత్వాన్నిచాటింది.ఆత్రేయ తన ఆత్మ కథను పద్యకావ్యంగా రచించారు. పీటిక,అంకితము,యోగ్యతా పత్రము,అమ్మ,పుట్టినిల్లు,పగ-బలి,భ్రాంతి,క్షమ,విద్యా బుద్ధులు,తొలి గాయం శీర్షికలతో రాసిన పద్యాలతో అసంపూర్ణ ఆత్మకథ తో ఆత్రేయ మన మధ్యనుండి దూరమయ్యాడు. వివాహానికి ముందు తాను ప్రేమించిన బాణం అనే అమ్మాయిని తలచుకొని ఆత్రేయ తన ఆత్మకథలో "తొలిగాయం"పేరుతో పద్యరచన చేస్తున్నాడని తెలుసుకున్న ఆత్రేయ గారి భార్య పద్మావతిగారు " తొలిగాయమని మీరు ఆత్మకథ రాస్తున్నారట! మీరు మరోమనిషికి చేసిన అన్యాయన్నికూడా మీ ఆత్మకథలో రాయండని"కోపంతో ఒక ఉత్తరాన్ని ఆత్రేయకు రాసి పోస్ట్ చేసారు. పోస్ట్ లో ఆ ఉత్తరాన్ని అందుకున్న ఆత్రేయ "ఆత్మకథ" లో రాయడ మేమిటి...కావాలంటే పేపర్లోనే వేయిస్తా"నని ఆత్రేయ ఆ ఉత్తరాన్ని ఆంధ్రజ్యోతి పత్రికవారికి తన మరణాంతరం దానిని ప్రచురించమని సీల్ చేసి ఇచ్చాడట. 1975 లోనో 1976 లోనో రాసిన ఆ ఉత్తరం ఆత్రేయ మరణాంతరం అంటే 1989 లో ఆంధ్రజ్యోతిలో ప్రచురింప బడింది. ఈ సంఘటనను బట్టి ఆత్రేయ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వమని గ్రహించవచ్చు. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకొని జీవితాన్ని దుఖంతో నింపు కున్నవాడు ఆత్రేయ. భర్తగా ఆత్రేయ భార్య అయిన పద్మావతి జీవితానికి న్యాయం చేయాలనుకునేవాడుగాని,తానున్న ఆ ఆకర్షణల వలయాలని చేదించుకొని రాలేక పోయాడు. ఐతే పశ్చాతాపంతో, ప్రేమతో భార్యకు అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉండేవాడు.
athreya gaari letters inkemaina dorike avakasam vundaa...plz vunte cheppandi
ReplyDelete