తెలుగు సినిమా పాటకూ,మాటకూ విజ్ఞాన సర్వస్వం వంటివారు ఆచార్య ఆత్రేయ. ఎందరో సినీ కవులకు స్ఫూర్తి,మార్గదర్శకులు ఆత్రేయ. అటువంటి గొప్ప కవిపై ఆమూలాగ్రంగా పరిశోధన చేసినవాడిని నేను. తెలుగు సినీ సాహిత్య పరిశోధనలో సినిమా సంభాషణలపై జరిగిన తొలి పరిశోదన నాది. "ఆత్రేయ సినిమా సంభాషణలు - ఒక పరిశీలన" అనే అంశంపై నేను పరిశోధన చేసి 2000 సంవత్సరంలో నా సిద్ధాంత గ్రంధాన్ని ఆంధ్ర విశ్వ విద్యాలయం వారికి సమర్పించి నాటి గవర్నర్ డా.రంగరాజన్ గారి చేతుల మీదుగా పిహెచ్.డి.పట్టాను స్వీకరించాను. ప్రత్యేకించి ఒక నాటక రచయిత సంభాషణలకు సంబంధించి వచ్చిన పరిశోధనా గ్రంధంకూడా నాదే. ఆత్రేయ నాటక సాహిత్యం పైగల వ్యక్తిగత ఆసక్తినిబట్టి "ఆత్రేయ నాటక సాహిత్యం-సంభాషణలు"అనే అంశంపై పరిశోధించి 1999 లో నేను దానిని గ్రంధరూపంలోకి తీసుకు వచ్చాను. ఆత్రేయ గారి సినిమా పాటలపై "మన'సు'కవి"అనే మరో పుస్తకాన్ని కూడా రచించి ఆత్రేయ అభిమానులకు అందించాను.ఆత్రేయగారి అభిమానుల కొరకు ఆత్రేయ గారి 151 ప్రసిద్ధ సినీగీతాలతో కూడిన "ఆత్రేయ ఆణిముత్యాలు" అనే mp3 audio c.d. ని నేను తీసుకువచ్చాను. ఆత్రేయ మొదటి,చివరి పాటలే కాక సూపర్ హిట్ సాంగ్స్ ఇందులో పొందుపరిచాను. ఆత్రేయగారి సాహిత్యం,వ్యక్తిత్వానికి సంబంధించి పద్మావతి ఆత్రేయ,ఆకెళ్ళ,జె.కె.భారవి,డి.వి.నరసరాజు,గొల్లపూడి మారుతీరావు,బొల్లిముంత శివరామకృష్ణ,డా.డి.రామానాయుడు,కాశీవిశ్వనాథ్,తనికెళ్ళ భరణి వంటి ప్రముఖుల ఇంటర్వ్యూలను "ఆత్రేయ సాహిత్యం - వ్యక్తిత్వం" పేరుతో ఆడియో సి.డీ. గా రూపొందించాను. స్కాలర్ గా ఉన్న రోజుల్లోనే ఆత్రేయ జీవితం, సాహిత్యం పై "మహాకవి ఆత్రేయ" అనే డాక్యుమెంటరీ వీడియో సి.డీ.ని రూపొందించాను. ఆతర్వాత "ఆత్రేయ సినిమా పాటలు","సంభాషణా చాణుక్యుడు ఆత్రేయ"అనే వీడియో సి.డీ.లనుకూడా నేను రూపొందించడం జరిగింది.
2004 మే 7 వ తేదీన ఆచార్య ఆత్రేయ 83 వ జయంతిని పురస్కరించుకొని "ఆత్రేయ సాహితీ స్రవంతి" అనే సంస్థ ని ఇండియన్ హైకు క్లబ్ అనుబంధ సంస్థగా నేను స్థాపించాను.2004 వ సంవత్సరానికిగాను ఆత్రేయ సాహితీ స్రవంతి గౌరవ సలహాదారులుగా శ్రీమతి పద్మావతి ఆత్రేయ, రసరాజు గార్లు వ్యవహరించారు. సాయి కుల్వంత్ కళాశాలల కరస్పాండెంట్ శ్రీ ఎమ్.కామరాజు డిజిటల్ బ్యానర్ ను ఆవిష్కరించారు. తొలి కార్యక్రమాన్ని ప్రముఖ గైనకాలజిస్ట్ డా.విజయలక్ష్మీ గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం ఆత్రేయ జయంతి,వర్థంతి సభలను నిర్వహించడమే గాక ప్రముఖ తెలుగు సినీ రచయితల సినీ సాహిత్యంపై కూడా ఈ సంస్థ సాహితీ కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనతో వేటూరి సంస్మరణ సభను,ఆరుద్ర,దాశరధి సభలను నిర్వహించింది. ప్రతి సంవత్సరం విడుదలైన తెలుగు చిత్రాలలోని సంభాషణలను, పాటలను, కథలను పరిశీలించి ఉత్తమ గేయ రచయిత,ఉత్తమ మాటల రచయిత,ఉత్తమ కథా రచయిత ల అవార్డ్ లను ఆత్రేయ సాహితీ స్రవంతి ప్రకటించి ప్రశంసా పత్రంతో, సన్మాన - సత్కారాలతో విజేతలను తగురీతిగా గౌరవించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. సినీ పరిశ్రమకు ఉత్తమ సాహిత్యాన్ని అందించినవారికి సంస్థ "ఆత్రేయ సాహితీ పురస్కారం"ను ప్రదానం చేస్తోంది. సినీ రచయితగా విశిష్ట సేవలందిస్తున్న వారికి ఆత్రేయ సాహితీ స్రవంతి బిరుదు ప్రదానం చేస్తోంది.
2006 మే 7 వ తేదీ , ఆత్రేయ 85 వ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ జాలాది గారికి "జానపద గేయ శిరోమణి"బిరుదును ప్రదానం చేసింది. 13 సెప్టెంబర్ 2006 ఆత్రేయ గారి 17 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆత్రేయ శిష్యులు శ్రీ గురుచరణ్ గారికి "ఆత్రేయ సాహితీ పురస్కారం"ను ప్రదానం చేసింది ఆత్రేయ సాహితీ స్రవంతి.
డిజిటల్ బ్యానర్ ఆవిష్కరణ ద్వారా
ఆత్రేయ సాహితీ స్రవంతి సంస్థను ప్రారంభిస్తున్న
ఆత్రేయ సాహితీ స్రవంతి సంస్థను ప్రారంభిస్తున్న
సాయి కుల్వంత్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఎం .కామరాజు
డా.తలతోటి పృథ్వి రాజ్ రచించిన "మనసుకవి " అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన
ప్రముఖ వైద్యులు శ్రీమతి డా.జె.విజయలక్ష్మి
ప్రముఖ వైద్యులు శ్రీమతి డా.జె.విజయలక్ష్మి
ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న
ఇండియన్ హైకూ క్లబ్ పోషకులు శ్రీ ఎస్.కమలాకర రావు
2004 సెప్టెంబర్ 13 న ఆత్రేయ 15 వ వర్థంతిని పురస్కరించుకుని
ఆత్రేయ సాహితీ స్రవంతి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి
ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న
ప్రముఖ కథ రచయిత శ్రీ ఇచ్చాపురపు రామచంద్ర రావు
2005 మే 7న ఆత్రేయ 84 వ జయంతిని పురస్కరించుకుని
ఆత్రేయ సాహితీ స్రవంతి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి
ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న
ప్రముఖ సంఘ సేవకులు శ్రీ రాపర్తి జగదీశ్ కుమార్
( చిత్రపటానికి ఎడమ వైపు ఉన్న వ్యక్తి )
2005 సెప్టెంబర్ 13 న ఆత్రేయ 16 వ వర్థంతిని పురస్కరించుకుని
ఆత్రేయ సాహితీ స్రవంతి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి
ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న
కవి ,రచయిత డా. మళ్ళ రామప్పరావు
2006 మే 7న ఆత్రేయ 85 వ జయంతిని పురస్కరించుకుని
ఆత్రేయ సాహితీ స్రవంతి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన
శ్రీ జాలాదిగారిని జానపద శిరోమణి బిరుదుతో సత్కరిస్తున్న సభ్యులు.
ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి ప్రసంగిస్తున్న శ్రీ జాలాది
జాలాది గారికి సమర్పించిన బిరుదు పత్రం
2006 సెప్టెంబర్ 13 న ఆత్రేయ 17 వ వర్థంతి సభకు
ముఖ్య అతిథిగా విచ్చేసి ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి
నివాళి అర్పిస్తున్న ఆత్రేయ శిష్యులు,రచయిత శ్రీ గురుచరణ్
గురుచరణ్ గారికి సమర్పించిన ఆత్రేయ సాహితీ స్రవంతి పురస్కారం
2007 మే 7న ఆత్రేయ 86 వ జయంతిని పురస్కరించుకుని
ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు ఆత్రేయ చిత్రపటానికి
పూలమాల వేసి నివాళి అర్పించి దృశ్యం
2007 మే 7న ఆత్రేయ 86 వ జయంతి సభలో డా.తలతోటి పృథ్వి రాజ్
రూపొందించిన "సంభాషణా చాణుక్యుడు ఆత్రేయ"అనే
వీడియో సి.డీ.ని ఆవిష్కరిస్తున్న
ఇండియన్ హైకు క్లబ్ కోశాధికారి శ్రీమతి పి. అమరజ్యోతి.
2007 సెప్టెంబర్ 13 న ఆత్రేయ 18 వ వర్థంతి సభని పురస్కరించుకుని
ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు ఆత్రేయ చిత్రపటానికి
పూలమాల వేసి నివాళి అర్పించి దృశ్యం
2010 మే 7న ఆత్రేయ 89 వ జయంతిని పురస్కరించుకుని
ఆత్రేయ సాహితీ స్రవంతి సభ్యులు ఆత్రేయ చిత్రపటానికి
పూలమాల వేసి నివాళి అర్పించి దృశ్యం
2010 సెప్టెంబర్ 13 న ఆత్రేయ 21 వ వర్థంతి పురస్కరించుకొని
అనకాపల్లి యంగ్ పోయట్స్ ప్రారంభోత్సవ సభకు
ముఖ్య అతిథిగా విచ్చేసి ఆత్రేయ చిత్రపటానికి పూలమాల వేసి
నివాళి అర్పిస్తున్న సాహితీ వేత్తలు శ్రీ రామతీర్థ,జగద్ధాత్రి