శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అనికూడా పేరు మూట గట్టుకునేలా చేసింది. " నా సినిమా సాహిత్యాన్ని గురించి మరికొన్ని నిజాలు చెప్పాలి. నేను రాసినవన్నీ మంచివి కావు. కొన్ని చెత్త పాటలూ రాశాను. కొన్ని బూతులు ధ్వనించేలా రాశాను. సినిమా కవి బ్రతుకు అనేకానేక అభిరుచులుగల విటులను సంతృప్తి పరచవలసిన పడుపు వృత్తి" అని ఒకచోట బాధపడుతూ అంటాడు ఆత్రేయ. "మనుషులూ-మమతలు" అనే చిత్రంలో ఒక సెంటిమెంట్ సన్నివేశానికి సంభాషణ అశ్లీలంగా హేతుబద్దంగా రాయాల్సివచ్చినప్పుడు ఆత్రేయ ఎంత గొప్పగా రాసాడో మనం గుర్తించవచ్చు.
రాధ భర్త భాస్కర్. తండ్రిపై బెంగపెట్టుకున్నబిడ్డకోసం అత్త సూచన మేరకు వాణి అనే వేశ్య వలలో పడిపోయి,తాగుడుమత్తులో మునిగి పోతున్న భర్తకోసం రాధ నేరుగా తన భర్త ఉన్న వేశ్య ఇంటికి వెళుతుంది. ఒక సంసారికి, వేశ్యకు మధ్య జరిగిన సంభాషణను ఆత్రేయ ఎంతో సెంటిమెంట్ గా, హేతుబద్దంగా రచించారు.
No comments:
Post a Comment