"ఆత్రేయ పాటల్లో లోతైన భావాలు,జీవిత సత్యాలు,ఎంతో మేధస్సు ఇమిడి వున్నాయి. ప్రజల ఆలోచనలు,ఊహాగానాలు ఆయన పాటల్లో వుట్టిపడుతుంటాయి. మనిషి జీవిత అనుభవాలు,చీకటి,వెలుతురు,అపజయాల గురించి ఆయన హృదయాలకు హత్తుకునే విధంగా పాటలు రాశారు" ~ కీ.శే.ఎన్.టి.రామారావు     "మానవ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, గెలుపు ఓటములను అనుభవాలను ప్రతిబింబిస్తూ మనసుల్ని కదిలించే విధంగా ఆయన రాసిన పెక్కు పాటలు చిరస్మరణీయాలై నిలిచాయి" ~ ఎన్.టి.రామారావు     "ఆత్రేయ వ్రాసిన పాటలన్నీ ప్రజల మనోభావాలను పుణికిపుచ్చుకుని ఉండేవి" ~ఎన్.టి.రామారావు     "ఆత్రేయ అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగ కర్త, ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట,పాటల ముత్యాలపేట" ~ డా.సి.నా.రె.     "బరువైన భావాల కొండలను చిటికెను వేలుపై గోవర్ధన గిరివలె సునాయాసంగా తేలిక మాటల్లో వహించడం,వచించడం గీతాచార్యుడికే(ఆత్రేయ)తెలుసు" ~వేటూరి సుందరరామ మూర్తి     "భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను తిమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడం ఆచార్యుడు(ఆత్రేయ)తిక్కనకు వారసుడు" ~వేటూరి సుందరరామ మూర్తి     "సినీ సాహితీ రంగంలో అపర శ్రీనాథుడు. తెలుగు సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించినవాడు" ~గొల్లపూడి మారుతీరావు     "శృంగారమైనా,మమకారమైనా తేలిక పదాలతో చదువుకున్న వాణ్ణి ,చదువులేని వాణ్ని గుండె లోతులవరకూ కదిలించగల ప్రతిభ ఆత్రేయది" ~ గొల్లపూడి మారుతీరావు     " తెలుగు సినిమాకు ఒక గొప్ప రూపాన్ని కల్పించిన రచయిత. తనదైన బాణీని ఇచ్చిన రచయిత ఆత్రేయగారు" ~గొల్లపూడి మారుతీరావు     "ఆత్రేయ వ్రాసిన పాటల్లో ప్రతి పల్లవి తీసుకొని ఒక కథ వ్రాయవచ్చు. అంత గంభీరమైన,భావస్పోరకమైన భాష ఆత్రేయది" ~కె.ఎస్.ప్రకాశరావు     " తెలుగు భాష తెలిసిన నటీనటులకు ఆత్రేయ సంభాషణలు పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరి." ~ గుమ్మడి వెంకటేశ్వరరావు      "శ్రీ ఆత్రేయ వ్యక్తిగా చాలా నిరాడంబరుడు. ఆయన విలువ ఆయనకే తెలియని ఒక సామాన్యుడు. కత్తితో కోస్తే రక్తం వస్తే, ఆయన కలంతో రాస్తే రక్తం ఉడుకెక్కుతుంది. మనసు ఉరకలేస్తుంది.రాసినవాడికి కాదు, ఆయన రాసింది చదువుకునే వాడికి! ~ శ్రీ కె.విశ్వనాథ్     " శ్రీ ఆత్రేయ గారు స్వయంగా నటుడు, ప్రయోక్త,రచయిత కాబట్టి ప్రతి డైలాగు రాసిన తర్వాత నటుడిగా నటించుకొని, ప్రయోక్తగా ఎంతవరకూ కావాలో కుదించుకొని, అక్షరలక్షలుగా వ్రాయటం, ఆయనలోని ప్రత్యేకత." ~ మురళీమోహన్     " ఎక్కడ ఇపోతాయో...అన్నంత పొదుపుగా తన సంభాషణా రచనలో మాటల్ని వాడుకున్నవాడు ఆత్రేయ" ~తనికెళ్ళ భరణి     "తెలుగు సినిమా పాటకో మనసుని, ఉన్నతమైన భావాన్ని ఇచ్చిన ఘనత ఆత్రేయకు దక్కుతుంది." ~కె.రామలక్ష్మి ఆరుద్ర     "మామూలు మాటలతో పాటలని పొదగ వచ్చు అనే విషయాన్ని మొట్ట మొదటిగా ప్రదర్శించి చెప్పింది, ఆచరించి చూపింది ఆచార్య ఆత్రేయ" ~కొంగర జగ్గయ్య     "వేమన తరువాత ఆత్రేయ పుట్టాడు. అంత తేట తెలుగుదనం ఉంది ఆయన రచనలో" ~ హీరో కృష్ణంరాజు     "ఆత్రేయగారి డైలాగ్స్ కి ట్యూన్ కడితే పాట,ఆయన పాటని ట్యూన్ లేకుండా చదివితే డైలాగ్" ~సత్యానంద్     "సినీ సంభాషణా శైలిని పరిశీలిస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అన్నట్లుగా "ఆత్రేయ పూర్వం-ఆత్రేయ తర్వాత" అని ఖచ్చితంగా అనవచ్చు." ~తోటపల్లి మధు.      "బరువైన తేలిక పదాలతో మనసుకు,మనిషికి కొత్త భాష్యాన్ని చెప్పినవారు ఆత్రేయ" ~డా.పర్వతనేని సుబ్బారావు     "తెలుగు సినీ జగత్తుని తన పాటల మాటల వెన్నెల జల్లుతో నిరంతరం పరవశింప జేస్తున్న నెలరేడు ఆత్రేయుడు" ~డా.తలతోటి పృథ్వి రాజ్

Research works on Athreya writings

ఆత్రేయ నాటక,సినిమా సాహిత్యాలపై ఇప్పటివరకు వివిధ విశ్వ విద్యాలయాలపై  జరిగిన పరిశోధనలు. వెలువడిన గ్రంథాలు
  • శ్రీ ఎ.వి.రవీంద్ర కుమార్ "ఆత్రేయ నాటికా సాహితి"అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 1980 లో ఎం.ఫిల్.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు. 
  • శ్రీ పైడిపాల "ఆత్రేయ నాటాకాలు - పూర్వాపరాలు "అనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 1984 లో ఎం.ఫిల్.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
  • కె.రాధాదేవి "ఆత్రేయ అభ్యుదయ ఆదర్శాలు"అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయానికి 1990 లో సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
  • కె.స్వర్ణలత "ఆత్రేయ విశ్వ శాంతి - వైశిష్ట్యం"అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయానికి 1992 లో సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
  • కె.బి.శ్రీలక్ష్మీ " ఆత్రేయ సినీ గీతాలు - ఒక పరిశీలన "అనే అంశంపై శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి 1994 లో పిహెచ్.డి.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
  • శ్రీమతి ఆదుర్తి వెంకటనాగా శోభ  " ఆత్రేయ - కన్నదాసన్ పాటలు - ఒక తులనాత్మక పరిశీలన "అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయానికి పిహెచ్.డి.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు.
  • శ్రీ తలతోటి పృథ్వి రాజ్ " ఆత్రేయ సినిమా సంభాషణలు - ఒక పరిశీలన "అనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 1999 లో పిహెచ్.డి.సిద్థాంత గ్రంధాన్ని సమర్పించారు 
ఆత్రేయ నాటక,సినిమా సాహిత్యాలపై వెలువడిన గ్రంథాలు.
  • " ఆత్రేయ సాహితి " పేరున కీ.శే.కొంగర జగ్గయ్య సంపాదకత్వంలో మనస్వ్విని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్, మదరాసు వారు 1990 లో ప్రచురించిన ఏడు సంపుటాలు. 
  • "ఆచార్య ఆత్రేయ తెలుగు నాటక రంగం "అనే పేరుతో మొదలి నాగభూషణ శర్మ సంపాదకత్వంలో 1986  లో ప్రచురింపబడిన గ్రంధం