ఆచార్య ఆత్రేయ చివరిదశలో హాస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన "భామాకలాపం" సినిమాలో అతిధి పాత్రలో నటించారు. ఆత్రేయ గారు సహాయ నటుడిగా ప్రధాన భూమికగా "కోడెనాగు" చిత్రంలో నటించారు. ఆత్రేయ గారు "ఆదర్శం" చిత్రంలోకూడా నటించారు. భామాకలాపం"లో ఆత్రేయకు హాస్య సంభాషణలు సమకూర్చింది తానేనని శ్రీ దివాకరబాబు నేనుచేసిన ఇంటర్యూలో అంటాడు. హాస్యంకోసం ఉద్దేశించి పెట్టిన సన్నివేశమే అయినా ఇందులో ఎన్నో విషయాలకు ఆత్రేయగారు సమాధానం చెబుతారు. "రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతల్ని" ఆత్రేయ ఏడిపిస్తాడు అనే అపవాదానికి సమాధానమన్నట్లు సంభాషణ ఉంటుంది. ఆత్రేయను హాస్పటల్ కు తీసుకువచ్చిన సహాయకుని పాత్రలో నటించింది అప్పటి ఆత్రేయ అసిస్టెంట్ ,నేటి సినీ రచయిత, ఆత్రేయ సాహితీ పురస్కార గ్రహీత శ్రీ గురుచరణ్. ఇలా ఆత్రేయ మూడు సినిమాలలో నటించాడుగాని స్వయంగా తాను నిర్మించిన వాగ్దానం చిత్రంలో నటించే అవకాశం ఉన్నా నటించలేదు. అంత శ్రద్ధవహించి చిత్రాన్ని నిర్మించినా సినిమా ఆడక ఆత్రేయ నష్టపోయారు. మరెప్పుడు సినిమా తీయనని ఆత్రేయ "వాగ్దానం"చేసినట్లు అందరూ అంటుంటారు.
No comments:
Post a Comment